హాయ్‌.. నేను Karnataka వస్తున్నా అంటూ...

ABN , First Publish Date - 2022-06-21T16:52:41+05:30 IST

‘హాయ్‌ నేను కర్ణాటకకు వస్తున్నా..’ అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ కన్నడలో ట్వీట్‌ చేశారు. రెండురోజుల రాష్ట్ర పర్యటనకు వచ్చే

హాయ్‌.. నేను Karnataka వస్తున్నా అంటూ...

                               - ప్రధాని మోదీ కన్నడలో ట్వీట్‌


బెంగళూరు, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): ‘హాయ్‌ నేను కర్ణాటకకు వస్తున్నా..’ అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ కన్నడలో ట్వీట్‌ చేశారు. రెండురోజుల రాష్ట్ర పర్యటనకు వచ్చే ముందు.. కర్ణాటకకు వెళుతున్నానని, బెంగళూరు, మైసూరులో జరిగే పలు కార్యక్రమాలలో పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైస్స్‏లో మెదడు పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభిస్తానని ఇదే ప్రాంగణంలోనే బాగ్చి-పార్థసారథి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేస్తానని రాసుకున్నారు. మధ్యాహ్నం బీఆర్‌ అంబేడ్కర్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ను ప్రారంభిస్తానని, సాయంత్రం 5 గంటల తర్వాత మైసూరుకు వెళతానని రాసుకున్నారు.

Updated Date - 2022-06-21T16:52:41+05:30 IST