హాయ్.. నేను Karnataka వస్తున్నా అంటూ...
ABN , First Publish Date - 2022-06-21T16:52:41+05:30 IST
‘హాయ్ నేను కర్ణాటకకు వస్తున్నా..’ అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ కన్నడలో ట్వీట్ చేశారు. రెండురోజుల రాష్ట్ర పర్యటనకు వచ్చే
- ప్రధాని మోదీ కన్నడలో ట్వీట్
బెంగళూరు, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): ‘హాయ్ నేను కర్ణాటకకు వస్తున్నా..’ అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ కన్నడలో ట్వీట్ చేశారు. రెండురోజుల రాష్ట్ర పర్యటనకు వచ్చే ముందు.. కర్ణాటకకు వెళుతున్నానని, బెంగళూరు, మైసూరులో జరిగే పలు కార్యక్రమాలలో పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైస్స్లో మెదడు పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభిస్తానని ఇదే ప్రాంగణంలోనే బాగ్చి-పార్థసారథి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేస్తానని రాసుకున్నారు. మధ్యాహ్నం బీఆర్ అంబేడ్కర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ను ప్రారంభిస్తానని, సాయంత్రం 5 గంటల తర్వాత మైసూరుకు వెళతానని రాసుకున్నారు.