ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్‌గా మోదీ విశ్వాస పాత్రుడు

ABN , First Publish Date - 2020-02-20T02:04:09+05:30 IST

రామ జన్మభూమి నిర్మాణ కమిటీకి చైర్మన్‌గా ప్రధాని మోదీకి అత్యంత విశ్వాస పాత్రుడు, మాజీ ప్రిన్సిపల్ సెక్రెటరీ నృపేంద్ర మిశ్రా ఎన్నికయ్యారు. ఇక

ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్‌గా మోదీ విశ్వాస పాత్రుడు

లక్నో : రామ జన్మభూమి నిర్మాణ కమిటీకి చైర్మన్‌గా ప్రధాని మోదీకి అత్యంత విశ్వాస పాత్రుడు, మాజీ ప్రిన్సిపల్ సెక్రెటరీ నృపేంద్ర మిశ్రా ఎన్నికయ్యారు. ఇక, రామ మందిర ట్రస్టుకు అధ్యక్షుడిగా మహంత్ నృత్య గోపాల్ దాస్, ప్రధాన కార్యదర్శిగా చంపత్ రాయ్ ఎన్నికయ్యారు. సీనియర్ న్యాయవాది పరాశరన్ నివాసంలో దీనికి సంబంధించిన సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే వీరి ఎన్నిక ఖాయమైంది. రామ మందిర నిర్మాణాన్ని ఎలా వేగవంతం చేయాలి, అడ్డంకులను ఎలా తొలగించాలన్న దానిపైనే ప్రధానంగా వీరి మధ్య చర్చ జరిగింది. అంతేకాకుండా రామాలయ నిర్మాణానికి ఎవరైనా విరాళాలు ఇవ్వాలని భావిస్తే అయోధ్యలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఓపెన్ అకౌంట్ ఉందని, అందులో జమ చేయవచ్చని చంపత్ రాయ్ వెల్లడించారు. మరోవైపు ఈ ట్రస్టుకు కోశాధికారిగా స్వామి గోవింద్ దేవ్ గిరి ఎన్నికయ్యారు.  

Updated Date - 2020-02-20T02:04:09+05:30 IST