మహమ్మారి బారిన పడ్డ బ్రెజిల్ అధ్యక్షుడు.. స్పందించిన మోదీ!
ABN , First Publish Date - 2020-07-09T05:07:09+05:30 IST
కరోనా వైరస్ బ్రెజిల్లో విజృంభిస్తున్న విషయం తెలిసిందే. దీంతో మొదటి నుంచి మహమ్మారిని తేలికగా తీసుకున్న బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో మంగళవారం
న్యూఢిల్లీ: కరోనా వైరస్ బ్రెజిల్లో విజృంభిస్తున్న విషయం తెలిసిందే. దీంతో మొదటి నుంచి మహమ్మారిని తేలికగా తీసుకున్న బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో మంగళవారం రోజు కొవిడ్-19 బారిన పడ్డరు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్రమోదీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘మిత్రుడు, బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో మహమ్మారి నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇదిలా ఉంటే.. వరల్డ్ఒమీటర్.ఇన్ఫోలోని సమాచారం ప్రకారం బ్రెజిల్లో కొవిడ్ -19 బాధితుల సంఖ్య 17లక్షలకు చేరువలో ఉంది. సుమారు 67 వేల మంది ప్రాణాలను కోల్పోయారు.