పుతిన్‌తో ఈ రాత్రికి మాట్లాడనున్న మోదీ!

ABN , First Publish Date - 2022-02-25T01:52:18+05:30 IST

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్రమోదీ ఈ రాత్రికి రష్యా అధ్యక్షుడు

పుతిన్‌తో ఈ రాత్రికి మాట్లాడనున్న మోదీ!

న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్రమోదీ ఈ రాత్రికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య బాంబుల మోత మోగుతున్న ప్రస్తుత సమయంలో ఇరువైపులా భారీ నష్టం జరిగినట్టు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొని ఉండగా ఈ ఉదయం ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభించింది. ఈ నేపథ్యంలో జోక్యం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉక్రెయిన్ భారత్‌ను కోరింది. 


మరోవైపు, ఉక్రెయిన్‌లోని 70 లక్ష్యాలను ఛేదించినట్టు రష్యా పేర్కొనగా, రష్యా యుద్ధ విమానాన్ని కూల్చేశామని, 50 మందిని హతమార్చామని ఉక్రెయిన్ ప్రకటించింది. రష్యా కూడా అలాంటి ప్రకటనే చేసింది. 40 మంది ఉక్రెయిన్ సైనికులను హతమార్చామని వెల్లడించింది. మరోవైపు, ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జాతీయ భద్రతా బృందంతో సమావేశమయ్యారు.

Updated Date - 2022-02-25T01:52:18+05:30 IST