డైనమిక్ సిటీ హైదరాబాద్ కు చేరుకున్నా: మోదీ
ABN , First Publish Date - 2022-07-02T21:59:16+05:30 IST
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ చేరుకున్న వెంటనే తెలుగులో ట్వీట్ చేశారు.డైనమిక్ సిటీ హైదరాబాద్ చేరుకున్నానని మోదీ ట్వీట్ లో పేర్కొన్నారు.
హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ చేరుకున్న వెంటనే తెలుగులో ట్వీట్ చేశారు.డైనమిక్ సిటీ హైదరాబాద్ చేరుకున్నానని మోదీ ట్వీట్ లో పేర్కొన్నారు.హైదరాబాద్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నవేళ తాను హైదరాబాద్ వచ్చినట్టు పేర్కొన్నారు.పార్టీ బలోపేతంపై చర్చిస్తామని ట్విటర్లో ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాగా ప్రధాని మోదీ ట్వీట్కు మంత్రి తలసాని వెంటనే స్పందించారు.హైదరాబాద్ను డైనమిక్ సిటీగా ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు అంటూ ఆయన ట్వీట్ చేశారు.