రాణి కమలాపతి రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన మోదీ

ABN , First Publish Date - 2021-11-15T22:39:40+05:30 IST

గోండు పాలకురాలు రాణి కమలాపతి రైల్వే‌స్టేషన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ భోపాల్‌లో..

రాణి కమలాపతి రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన మోదీ

భోపాల్: గోండు పాలకురాలు రాణి కమలాపతి రైల్వే‌స్టేషన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ భోపాల్‌లో సోమవారం ప్రారంభించారు. మధ్యప్రదేశ్‌లో తొలి వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్‌గా దీనిని ఇటీవల అభివృద్ధి పరిచారు. రాణి కమలాపతి రైల్వే స్టేషన్‌తో పాటు పలు ర్వైల్వే ప్రాజెక్టులను దేశప్రజలకు ప్రధాని అంకింతం చేశారు. భోపాల్‌లో నిర్వహించిన తొలి 'జన్‌జాతీయ గౌరవ్ దివస్‌' మహాసమ్మేళన్‌లో పాల్గొనేందుకు ప్రధాని ఇక్కడకు వచ్చారు.


గేజ్ కన్వర్షన్‌తో పాటు విద్యుద్దీకరణ చేసిన ఉజ్జయిని-ఫతేబాద్ ఛంద్రావిగంజ్ బ్రాడ్ గ్రేజ్ సెక్షన్, ఎలక్ట్రిఫైడ్ మథేలా-నిమర్ ఖేరి బ్రాడ్ గేజ్ సెక్షన్, ఎలక్ట్రిఫైడ్ గుణ-గ్వాలియర్ సెక్షన్‌లను కూడా మోదీ ఈ సందర్భంగా జాతికి అంకితం చేశారు. వీటితో పాటు ఉజ్జయిని-ఇండోర్, ఇండోర్-ఉజ్జయిని మధ్య నడిచే రెండు కొత్త ఎంఈఎంయూ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు.

Updated Date - 2021-11-15T22:39:40+05:30 IST