జూలై 4న భీమవరానికి ప్రధాని మోదీ
ABN , First Publish Date - 2022-07-03T18:13:35+05:30 IST
కృష్ణా: ఏపీలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. భీమవరంలో జూలై 4వ తేదీ నిర్వహించే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 150 జయంతి వేడుకల్లో ప్రధాని పాల్గొంటారు. మోదీ పర్యటన
కృష్ణా: ఏపీలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. భీమవరంలో జూలై 4వ తేదీ నిర్వహించే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 150 జయంతి వేడుకల్లో ప్రధాని పాల్గొంటారు. మోదీ పర్యటన నేపథ్యంలో జూలై 3 వ తేదీ అధికారులు ట్రయిల్ రన్ నిర్వహించారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. ఎస్పీజీ బలగాలు విమానాశ్రయం పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి. ప్రధాని రాక దృష్ట్యా విమానాశ్రయం పరిసరాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు.