అమెరికా మాజీ అధ్యక్షుడికి కరోనా.. మీరు త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేసిన భారత ప్రధాని

ABN , First Publish Date - 2022-03-15T03:36:19+05:30 IST

కరోనా బారిన పడ్డ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.

అమెరికా మాజీ అధ్యక్షుడికి కరోనా.. మీరు త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేసిన భారత ప్రధాని

ఎన్నారై డెస్క్: కరోనా బారిన పడ్డ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. ఒబామా, ఆయన కుటుంబ సభ్యులు ఎల్లప్పుడు ఆరోగ్యంగా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్టు ప్రధాని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. తనకు కరోనా సోకినట్టు బరాక్ ఒబామా ఆదివారం నాడు ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. గొంతులో ఇబ్బందిగా ఉండటం మినహా తాను బాగానే ఉన్నట్టు పేర్కొన్నారు. తన సతీమణి మిషెల్ కూడా కరోనా లేనట్టు తేలిందన్నారు. అయితే.. తామిద్దరం ఇప్పటికే కరోనా టీకాలు బూస్టర్ డోసుతో సహా తీసుకొన్నామని తెలిపిన ఆయన ప్రజలందరూ కరోనా టీకా తీసుకోవాలని మరోసారి సూచించారు. కేసులు తగ్గుముఖం పడుతున్నాయంటూ నిర్లక్ష్యం వహించవద్దని చెప్పారు. 

Updated Date - 2022-03-15T03:36:19+05:30 IST