ప్రవాసుల విజయాలకు గర్విస్తున్నాం: మోదీ
ABN , First Publish Date - 2022-01-10T12:59:59+05:30 IST
ప్రవాసభారతీయుల దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రవాసులకు శుభాకాంక్షలు తెలిపారు.
న్యూఢిల్లీ: ప్రవాసభారతీయుల దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రవాసులకు శుభాకాంక్షలు తెలిపారు. 1915లో జాతిపిత మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన రోజు(జనవరి 9)ను ఏటా ప్రవాస భారతీయుల దినోత్సవంగా జరుపుకొంటున్నాం. ‘మన ప్రవాసులు ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో రాణిస్తూ తమకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. అదే సమయంలో వారు తమ మూలాలను మరువలేదు. వారి విజయాల పట్ల మేం గర్విస్తున్నాం’ అని మోదీ ట్వీట్ చేశారు. అలాగే దేశాభివృద్ధిలో తమ భాగస్వామ్యాన్ని రెట్టింపు చేయాలని ప్రవాసులను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోరారు. ‘మీరు సాధించిన ఘనతలు మాకు గర్వకారణం. మన భావోద్వేగ బంధం మరింత బలపడుతోంది’ అని విదేశాంగమంత్రి జైశంకర్ ట్వీట్ చేశారు.