Delhi: ఇది ఆజాదీకా అమృత్ మహోత్సవ్ యుగం: PM Modi

ABN , First Publish Date - 2022-07-18T16:22:50+05:30 IST

పార్లమెంటు (Parliament) వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి.

Delhi: ఇది ఆజాదీకా అమృత్ మహోత్సవ్ యుగం: PM Modi

న్యూఢిల్లీ (Delhi): పార్లమెంటు (Parliament) వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. అలాగే రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) పార్లమెంట్లో మీడియాతో మాట్లాడుతూ ఇది ఆజాదీకా అమృత్ మహోత్సవ్ యుగమని అన్నారు. దేశంలో కొత్తశక్తిని పెంపొందించేందుకు.. పార్లమెంటు సభ్యులు మాద్యమంగా మారాలని పిలుపిచ్చారు. రాష్ట్రపతి ఎన్నికలు (Presidential election) జరుగుతున్న సమయమని, కొత్త రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని అందించబోతోందని అన్నారు. ఈ సెషన్‌ను దేశ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుందామన్నారు. పార్లమెంటులో చర్చలు జరగాలని.. విషయాలను లోతుగా విశ్లేషించాలని మోదీ అన్నారు. కాగా రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రధానమంత్రి ఓటు హక్కు వినియోగించుకున్నారు.


పార్లమెంట్‌, రాష్ట్రాల అసెంబ్లీల్లో.. ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎన్నికల బరిలో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము (Draupadi Murmu), ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా (Yashwant Sinha) ఉన్నారు. కాగా ఎన్డీఏ (NDA) అభ్యర్థి ముర్ముకే సంఖ్యాబలం అనుకూలంగా ఉంది. ముర్ముకు ఎన్డీఏ పక్షాలతో పాటు వైసీపీ (YCP), టీడీపీ (TDP), శివసేన (Shivasena), బీజేడీ (BJD) మద్దతు ఇస్తున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగతుంది. ఈ నెల 21న ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తారు.

Updated Date - 2022-07-18T16:22:50+05:30 IST