మాణిక్యాలరావు మృతి పట్ల మోదీ సంతాపం

ABN , First Publish Date - 2020-08-05T02:37:21+05:30 IST

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఇటీవలే కరోనాతో తుదిశ్వాస విడిచిన విషయం విదితమే.

మాణిక్యాలరావు మృతి పట్ల మోదీ సంతాపం

అమరావతి/న్యూ ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఇటీవలే కరోనాతో తుదిశ్వాస విడిచిన విషయం విదితమే. ఆయన మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. మంగళవారం సాయంత్రం మాణిక్యాలరావు సతీమణికి ప్రధాని సంతాప సందేశం పంపారు. బీజేపీ బలోపేతం కోసం మాణిక్యాలరావు ఎంతో శ్రమించారని.. పేద వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు ఎనలేనివని ప్రధాని మోదీ కొనియాడారు. మాణిక్యాలరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో జరిపిన సంగతి తెలిసిందే.

Updated Date - 2020-08-05T02:37:21+05:30 IST