గుజరాత్లో తల్లి హీరాబెన్ను కలిసిన Prime Minister Modi...తల్లితో కలిసి డిన్నర్
ABN , First Publish Date - 2022-03-12T12:47:14+05:30 IST
రెండు రోజుల గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం రాత్రి గాంధీనగర్లో తన తల్లి హీరాబెన్ మోదీని ఆమె నివాసంలో కలిశారు....
గాంధీనగర్ (గుజరాత్): రెండు రోజుల గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం రాత్రి గాంధీనగర్లో తన తల్లి హీరాబెన్ మోదీని ఆమె నివాసంలో కలిశారు.మోదీని అతని తల్లి హీరాబెన్ ఆశీర్వదించారు. హీరాబెన్ యోగక్షేమాలు తెలుసుకున్న ప్రధాని మోదీ ఆమెతో కలిసి డిన్నర్ చేశారు.అంతకుముందు శుక్రవారం అహ్మదాబాద్లో గుజరాత్ పంచాయతీ మహాసమ్మేళనంలో ప్రధాని మోదీ ప్రసంగించారు.అహ్మదాబాద్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు.ప్రధాని గుజరాత్ విమానాశ్రయం నుంచి బీజేపీ కార్యాలయం వరకు రోడ్షో కూడా నిర్వహించారు.ఈ ఏడాది చివర్లో గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.