ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటోంది: ప్రధాని మోదీ
ABN , First Publish Date - 2020-05-31T17:12:39+05:30 IST
కరోనా వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటోందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
న్యూఢిల్లీ: కరోనా వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటోందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. మన్ కీ బాత్లో ప్రసంగించిన ఆయన.. కరోనాపై దేశ ప్రజలంతా పోరాడుతున్నారన్నారు. భవిష్యత్లో మరింత జాగ్రత్తగా ఉండాలని, కరోనాపై పోరాటం మరింత సమర్థంగా కొనసాగించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ భౌతికదూరం పాటిస్తూ, మాస్కులు ధరించాలన్నారు. కరోనా సమయంలో ఎందరో కొత్తకొత్త ఆవిష్కరణలు చేశారని, విద్యారంగంలోనూ ఎన్నో ఆవిష్కరణలు జరిగాయన్నారు. విద్యార్థులకు ఆన్లైన్ పాఠాల కోసం కొత్త ఆవిష్కరణలు వచ్చాయన్నారు. కరోనా సమయంలో పేదలు, కూలీల బాధలు వర్ణనాతీతమన్నారు. వలస కూలీల తరలింపునకు శ్రామిక్ రైళ్లు నడుపుతున్నామన్నారు.