Yoga ప్రపంచానికి శాంతినిస్తోంది...మైసూర్ యోగా ఉత్సవాల్లో ప్రధాని మోదీ

ABN , First Publish Date - 2022-06-21T13:46:33+05:30 IST

అంతర్జాతీయ యోగా దినోత్సవం 2022 సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో జరిగిన యోగా వేడుకల్లో పాల్గొన్నారు...

Yoga ప్రపంచానికి శాంతినిస్తోంది...మైసూర్ యోగా ఉత్సవాల్లో ప్రధాని మోదీ

 మైసూర్ (కర్ణాటక):అంతర్జాతీయ యోగా దినోత్సవం 2022 సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో జరిగిన యోగా వేడుకల్లో పాల్గొన్నారు. ‘‘యోగా మన సమాజానికి శాంతిని కలిగిస్తుంది, ఇది మన ప్రపంచానికి శాంతిని తెస్తుంది,యోగా మన విశ్వానికి శాంతిని తెస్తుంది’’ అని ప్రధాని మోదీ అన్నారు.మైసూరు ప్యాలెస్ గ్రౌండ్స్‌లో ప్రధాని మోదీతో పాటు 15 వేల మందికి పైగా యోగా అభ్యాసకులు వేడుకల్లో పాల్గొన్నారు. 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచ వ్యాప్తంగా యోగా సాధన జరుగుతోందని తెలిపారు. 



ప్రపంచ వ్యాప్తంగా యోగా డే ఉత్సవాలు జరిగాయి.దేశవ్యాప్తంగా 75 నగరాల్లో యోగా డే వేడుకలు జరిగాయి. ఈ ఏడాది ‘యోగా ఫర్‌ హ్యుమానిటీ’ నినాదంతో యోగా డే ఉత్సవాలు జరిపారు.విశ్వ మానవాళి ఆరోగ్యమే లక్ష్యంగా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా యోగా చేస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. యోగాతో క్రమశిక్షణ, ఏకాగ్రత లభిస్తాయని ప్రధాని మోదీ వివరించారు.

Updated Date - 2022-06-21T13:46:33+05:30 IST