మోదీ First Ticket కొని ప్రధానమంత్రుల మ్యూజియం ప్రారంభం

ABN , First Publish Date - 2022-04-14T18:05:28+05:30 IST

ఢిల్లీలో కొత్తగా ఏర్పాటు చేసిన భారత ప్రధానమంత్రుల మ్యూజియాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం ప్రారంభించారు....

మోదీ First Ticket కొని ప్రధానమంత్రుల మ్యూజియం ప్రారంభం

న్యూఢిల్లీ: ఢిల్లీలో కొత్తగా ఏర్పాటు చేసిన భారత ప్రధానమంత్రుల మ్యూజియాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం ప్రారంభించారు. ప్రధాని మోదీ మొదటి టిక్కెట్‌ను కొనుగోలు చేసి మ్యూజియాన్ని సందర్శించారు.ఈ మ్యూజియం గత ప్రధానమంత్రుల కథతో పాటు వారు ఎదుర్కొన్న వివిధ సవాళ్ల ద్వారా దేశాన్ని ఎలా నడిపించారో చెబుతోంది.ఈ మ్యూజియం స్వాతంత్ర్య పోరాటం నుంచి భారతదేశ చరిత్ర యొక్క సంగ్రహావలోకనాలను అందిస్తుంది.భారత దేశంలోని 14 మంది మాజీ ప్రధానులకు ఈ మ్యూజియాన్ని మోదీ అంకితం చేశారు. ప్రధాని మోదీ గతంలో వివిధ నగరాల్లో మెట్రో రైడింగ్‌లో టిక్కెట్లు కొనుగోలు చేశారు. మోదీ ఎప్పుడూ డిజిటల్ చెల్లింపులు చేసేవారు.


 ప్రధానమంత్రులుగా పనిచేసిన నేతల గురించి అవగాహన కల్పించడానికి 14 మంది భారత మాజీ ప్రధానులపై మ్యూజియం అభివృద్ధి చేశారు. ఈ మ్యూజియంలో దేశ మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ జీవితం, ఆయన అందించిన సేవలపై ప్రదర్శన ఏర్పాటు చేశారు. ప్రపంచంలోని నలుమూలల నుంచి నెహ్రూకు లభించిన అనేక బహుమతులను మొదటిసారిగా ప్రదర్శించారు.


Updated Date - 2022-04-14T18:05:28+05:30 IST