మన్‌ప్రీత్‌కు మోదీ సర్‌ప్రైజ్‌ కాల్‌

ABN , First Publish Date - 2021-08-06T09:32:22+05:30 IST

ఒలింపిక్స్‌లో కాంస్య పతకం నెగ్గిన భారత హాకీ జట్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. జర్మనీపై గెలిచిన వెంటనే మైదానంలోనే ఉన్న భారత కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌కు మోదీ ఫోన్‌ చేశారు...

మన్‌ప్రీత్‌కు మోదీ సర్‌ప్రైజ్‌ కాల్‌

టోక్యో: ఒలింపిక్స్‌లో కాంస్య పతకం నెగ్గిన భారత హాకీ జట్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. జర్మనీపై గెలిచిన వెంటనే మైదానంలోనే ఉన్న భారత కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌కు మోదీ ఫోన్‌ చేశారు. ‘మన్‌ప్రీత్‌ జీ.. మీకు అభినందనలు. మీరు చరిత్ర లిఖించారు.. మీ విజయాన్ని చూసి భారతావని హర్షిస్తోంది. మీ రాకకోసం దేశమంతా ఎదురుచూస్తోంది’ అని మోదీ ఫోన్‌లో ప్రశంసించారు. ఆ వెంటనే పక్కనే ఉన్న జట్టు ప్రధాన కోచ్‌ గ్రాహం రీడ్‌తో మాట్లాడుతూ.. ‘కంగ్రాట్స్‌.. మనం చరిత్ర సృష్టించాం’ అని మోదీ అన్నారు. 

Updated Date - 2021-08-06T09:32:22+05:30 IST