Gujaratలో సమీపిస్తున్న అసెంబ్లీ ఎన్నికలు...మోదీ, అమిత్ షాల పర్యటన

ABN , First Publish Date - 2022-05-28T17:21:40+05:30 IST

గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో శనివారం ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలు శనివారం పర్యటించారు....

Gujaratలో సమీపిస్తున్న అసెంబ్లీ ఎన్నికలు...మోదీ, అమిత్ షాల పర్యటన

గాంధీనగర్: గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో శనివారం ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలు శనివారం పర్యటించారు. గాంధీనగర్ లో ప్రధాని మోదీ, అమిత్ షాలు ఒకే వేదికపై ప్రసంగించనున్నారు. పటేల్ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పాటిదార్ ప్రాబల్యం ఉన్న సౌరాష్ట్రలో జరిగే మెగా ఈవెంట్‌లో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. రాజ్‌కోట్‌లో 200 పడకల మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించడం ద్వారా మోదీ తన పర్యటనను ప్రారంభించారు.గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో సహకార్ సే సమృద్ధి అనే అంశంపై వివిధ సహకార సంస్థల నాయకుల సెమినార్‌లో ప్రధాని మోదీ ప్రసంగించారు. 


ఇఫ్కో, కలోల్‌లో నిర్మించిన నానో యూరియా (లిక్విడ్) ప్లాంట్‌ను కూడా మోదీ ప్రారంభిస్తారు.ప్రధాని మోదీ ఒక రోజు పర్యటన కోసం గుజరాత్ రాష్ట్రానికి వచ్చారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రెండు రోజుల పర్యటన కోసం వచ్చారు. కేడీపీ హాస్పిటల్ వల్ల వైద్యసేవలు మెరుగు పడ్డాయని ప్రధాని మోదీ చెప్పారు. తాను ప్రధానిగా ఈ స్థాయిలో నిలిచేందుకు గుజరాత్ తోడ్పడిందని మోదీ వ్యాఖ్యానించారు.


Updated Date - 2022-05-28T17:21:40+05:30 IST