పీఎం-కేర్స్‌కు ఆదిత్య బిర్లా గ్రూప్‌ రూ.500 కోట్ల విరాళం

ABN , First Publish Date - 2020-04-04T05:56:27+05:30 IST

పీఎం-కేర్స్‌ ఫండ్‌కు భారత పారిశ్రామిక రంగం భారీ ఎత్తున విరాళాలు అందజేస్తున్నాయి. కోవిడ్‌-19 కట్టడి కోసం ఆదిత్య బిర్లా గ్రూప్‌ రూ.500 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. కాగా కోవిడ్‌-19పై పోరాటానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయనిధికి

పీఎం-కేర్స్‌కు ఆదిత్య బిర్లా గ్రూప్‌ రూ.500 కోట్ల విరాళం

హైదరాబాద్‌: పీఎం-కేర్స్‌ ఫండ్‌కు భారత పారిశ్రామిక రంగం భారీ ఎత్తున విరాళాలు అందజేస్తున్నాయి. కోవిడ్‌-19 కట్టడి కోసం ఆదిత్య బిర్లా గ్రూప్‌ రూ.500 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. కాగా కోవిడ్‌-19పై పోరాటానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయనిధికి గంగవరం పోర్టు రూ.3 కోట్ల విరాళం ఇచ్చింది. ఈ మేరకు చెక్‌ను ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డికి గంగవరం పోర్టు చైర్మన్‌ డీవీఎస్‌ రాజు, సీఈఓ ఎన్‌ సాంబశివరావు అందజేశారు. హైదరాబాద్‌కు చెందిన వ్యాక్సిన్‌ తయారీ కంపెనీ ఇండియన్‌ ఇమ్యునాలిజికల్‌ లిమిటెడ్‌ (ఐఐఎల్‌) రూ.2.33 కోట్ల సాయం అందించగా   యూపీఎల్‌ రూ.75 కోట్ల విరాళం ఇచ్చింది.

Updated Date - 2020-04-04T05:56:27+05:30 IST