ఈ కంపెనీలకు రూ. 3,345కోట్ల ఇన్సెంటివ్‌లు?

ABN , First Publish Date - 2021-10-16T02:09:07+05:30 IST

కేంద్రం ప్రకటించిన ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ స్కీమ్‌(పీఎల్‌ఐఎస్)లో భాగంగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, 31 ప్రతిపాదనలకు ఓకే చెప్పింది.

ఈ కంపెనీలకు రూ. 3,345కోట్ల ఇన్సెంటివ్‌లు?

న్యూఢిల్లీ : కేంద్రం ప్రకటించిన ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ స్కీమ్‌(పీఎల్‌ఐఎస్)లో భాగంగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, 31 ప్రతిపాదనలకు ఓకే చెప్పింది. రాబోయే నాలుగున్నరేళ్లలో రూ. 3345 కోట్ల మేర ప్రోత్సాహకాలు అందించేందుకు, నిర్ణయించినట్లు  కమ్యూనికేషన్స్ మినిస్టర్  దేవుసిన్హ్ చౌహాన్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి, రాబోయే ఐదేళ్లలో ఇంకా రూ. 12,195 కోట్ల మేర ఇన్సెంటివ్స్ కోసం అర్హత సాధించిన కంపెనీలను కూడా ఆయన  ప్రకటించారు. మొత్తం 31 కంపెనీలను టెలికాం రంగంలో పిఎల్ఐకి అర్హత సాధించినట్లుగా ప్రకటించారు. వాటిలో 16 ఎంఎస్‌ఎంఈ, 15నాన్ ఎంఎస్ఎంఈలు( వీటిలో 7 గ్లోబల్ కంపెనీలు కూడా ఉన్నాయ్)ఉన్నట్లు తెలిసింది. 

ఎంఎస్‌ఎంఈ కేటగరీలో... 

కోరల్ టెలికాం, ఎహూమ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఫ్రాగ్ సెల్‌శాట్, ఎస్‌టీఎల్ నెట్వర్క్స్, 

నాన్-ఎంఎస్ఎంఈ కేటగరీలో... 

హెచ్‌ఎష్‌సీఎల్ టెక్నాలజీస్( లిస్టెడ్ కంపెనీ), ఆక్ష్ఆస్థా టెక్నాలజీస్( లిస్టెడ్ కంపెనీ), తేజాస్ నెట్వర్స్క్( లిస్టెడ్ కంపెనీ), వివిడిఎన్ టెక్నాలజీ, గ్లోబల్ కంపెనీలు

ఎరిక్‌సన్ సబ్సిడరీ-జాబిల్ సర్క్యూట్ ఇండియా, 

ఫాక్స్‌కాన్ సన్మినా, ఫ్లెక్స్‌ట్రానిక్స్, నోకియా ఇండియా ఉన్నాయి. 


ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ‌స్కీమ్‌తో  ఈ రంగంలో కొత్తగా 40 వేలమందికి, ఉపాధి కలగడంతో పాటు,  రూ. 1.82 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయనేది టెలికాం శాఖ అంచనా. 

Updated Date - 2021-10-16T02:09:07+05:30 IST