ఢిల్లీ ఉద్యోగితో మాట్లాడిన కెనడా మహిళ... ఆ తర్వాత పెట్టిన పోస్టు వైరల్

ABN , First Publish Date - 2021-05-13T12:46:40+05:30 IST

కెనడాకు చెందిన ఒక మహిళ.. తమ కంపెనీకి చెందిన ఒక ఉద్యోగితో ఫోన్‌లో మాట్లాడింది. ఢిల్లీకి చెందిన సదరు ఉద్యోగితో మాట్లాడిన అనంతరం ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది.

ఢిల్లీ ఉద్యోగితో మాట్లాడిన కెనడా మహిళ... ఆ తర్వాత పెట్టిన పోస్టు వైరల్

న్యూఢిల్లీ: కెనడాకు చెందిన ఒక మహిళ.. తమ కంపెనీకి చెందిన ఒక ఉద్యోగితో ఫోన్‌లో మాట్లాడింది. ఢిల్లీకి చెందిన సదరు ఉద్యోగితో మాట్లాడిన అనంతరం ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. ఇంతకీ ఆమె ఏం చెప్పిందంటే.. తాను మాట్లాడిన ఉద్యోగి ఫోన్‌లో వెక్కి వెక్కి ఏడ్చాడని ఆమె వెల్లడించింది. గడిచిన 10 రోజుల్లో రోజుకు ఒకరు చొప్పున తనకు కావలసిన వారు చనిపోయినట్లు ఆ వ్యక్తి చెప్పినట్లు ఆమె పేర్కొంది. ఆ మాటలు విన్న తర్వాత తన మనసు చలించిందని, ఆయనతో దాదాపు గంటపాటు మాట్లాడి ఓదార్చే ప్రయత్నం చేసినట్లు ఆమె చెప్పింది. ‘‘దాదాపు గంటసేపు ఫోన్‌లో మాట్లాడుకున్నాం. కేవలం మనుషులుగా మాట్లాడుకున్నాం. ఇతరులతో దయగా ఉండండి’’ అని ఆమె లింకెడిన్‌లో పోస్టు పెట్టింది. ప్రస్తుతం ఇది బాగా వైరల్ అవుతోంది.

Updated Date - 2021-05-13T12:46:40+05:30 IST