ప్లాస్టిక్ బియ్యం కాదు పౌష్టికాహారం: తహసీల్దార్
ABN , First Publish Date - 2022-05-21T03:20:58+05:30 IST
మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులు తమకు ప్లాస్టిక్ బియ్యం సరఫరా చేశారని శుక్రవారం తహసీల్దార్ రహీమొద్దిన్కు ఫిర్యాదు చేశారు.
సిర్పూర్(యూ),మే 20: మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులు తమకు ప్లాస్టిక్ బియ్యం సరఫరా చేశారని శుక్రవారం తహసీల్దార్ రహీమొద్దిన్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బియ్యంను తహసీల్దార్ రహీమొ ద్ధిన్కు చూపిం చారు. ఆయన బియ్యం పరిశీలించి మాట్లాడుతూ అది ప్లాస్టిక్ కాదు పౌష్టికాహారం గల బియ్యమని వివరించారు. ప్రజలకు పౌష్టికా హారం అందించడానికే ఏర్పాటు చేశామన్నారు.