ప్లాస్టర్ ఆఫ్ పారిస్ నిషేధంపై ఏడాదిపాటు స్టే
ABN , First Publish Date - 2020-05-23T08:47:19+05:30 IST
విగ్రహాల తయారీకి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ) ఉపయోగాన్ని నిషేధించే నిర్ణయాన్ని ఏడాదిపాటు నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభు త్వం శుక్రవారం ప్రకటించింది. కరోనా కారణంగా తలెత్తిన పరిస్థితుల దృష్ట్యా...
న్యూఢిల్లీ మే 22: విగ్రహాల తయారీకి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ) ఉపయోగాన్ని నిషేధించే నిర్ణయాన్ని ఏడాదిపాటు నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభు త్వం శుక్రవారం ప్రకటించింది. కరోనా కారణంగా తలెత్తిన పరిస్థితుల దృష్ట్యా కళాకారుల జీవనోపాధి దెబ్బతినకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. రానున్న వినాయకచవితి, దుర్గాపూజ ఉత్సవాల విగ్రహాల తయారీకి ముడిసరుకు కోసం కళాకారులు పెద్ద ఎత్తున డబ్బులు వెచ్చించారని ఈ నిర్ణయం వారికి ఆర్థికంగా తీవ్ర నష్టం కలిగిస్తుంది. కాబట్టి ఈ విషయంపై స్టే విధించాలని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావదేకర్కు మహారాష్ట్ర ఇతర రాష్ర్టాల నుంచి పెద్ద ఎత్తున వినతులు వెళ్లాయి.