మొక్కలు నాటి సంరక్షించాలి

ABN , First Publish Date - 2020-09-19T09:37:01+05:30 IST

మొక్కలు నాటడంతోనే సరిపోదని, వాటిని సంరక్షించినపుడే హరితహారం కార్యక్రమం విజయవంతం అవుతుందని కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు

మొక్కలు నాటి సంరక్షించాలి

కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు


ఘట్‌కేసర్‌ రూరల్‌: మొక్కలు నాటడంతోనే సరిపోదని, వాటిని సంరక్షించినపుడే హరితహారం కార్యక్రమం విజయవంతం అవుతుందని  కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. మండలంలోని అవుశాపూర్‌ గ్రామంలో శుక్రవారం కలెక్టర్‌ మొక్కలు నాటి నీళ్లుపోశారు. అనంతరం పార్కులను సందర్శించి మొక్కలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని, అప్పుడే హరితహారం కార్యక్రమం విజయవంతం అవుతుందన్నారు. పెరిగిపోతున్న కాలుష్య నివారణకు మొక్కల పెంపకం ఒక్కటే పరిష్కార మార్గమన్నారు. గ్రామాల్లో వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డు, ప్రకృతివనాలను అభివృద్ధి చేయడంలో జాప్యం వహించరాదన్నారు.


ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, సర్పంచ్‌ ఏనుగు కావేరిమశ్చేందర్‌ రెడ్డి, ఉపసర్పంచ్‌ ఎల్సాని అయిలయ్యయాదవ్‌, కార్యదర్శి ఉమాదేవి, వార్డుసభ్యులు రాధ, శిరీషవామన్‌రెడ్డి, శ్రీనివా్‌సగౌడ్‌, మల్లేష్‌, సంధ్య, పద్మ, కో-అప్షన్‌ సభ్యురాలు జయశ్రీ, నాయకులు మశ్చేందర్‌రెడ్డి, దయాకర్‌రెడ్డి, సాయిలు, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-19T09:37:01+05:30 IST