గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో మొక్కలు నాటిన సోనూసూద్

ABN , First Publish Date - 2020-09-29T15:10:43+05:30 IST

హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన 3వ విడత గ్రీన్ ఇండియా

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో మొక్కలు నాటిన సోనూసూద్

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన 3వ విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా సోమవారం రామోజీ ఫిలిం సిటీలో జాతీయస్థాయిలో వేలాది మంది వలస కూలీలను ఆదుకున్న ప్రముఖ స్వచ్ఛంద సేవకుడు, సినీ నటుడు సోనూసూద్ మొక్కలు నాటారు. దర్శకుడు శ్రీను వైట్ల ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన తాను ఈరోజు మొక్కలు నాటినట్లు సోనూసూద్ తెలిపారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆలోచనకు శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. కరోనా, తదనంతర కాలంలో పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత పెరిగిందన్నారు. చెట్లు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో తాను ఒకరిగా పాల్గొన్నందుకు ఆనందంగా ఉందని అన్నారు. ఇదే స్ఫూర్తితో లక్షలాది మంది గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ మొక్కలు నాటాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని సోనూసూద్ పిలుపునిచ్చారు.

Updated Date - 2020-09-29T15:10:43+05:30 IST