మొక్కల రక్షణ బాధ్యత అధికారులదే : కలెక్టర్
ABN , First Publish Date - 2022-01-28T06:38:00+05:30 IST
అవెన్యూ ప్లాం టేషన్లో భాగంగా నాటిన ప్రతీమొక్కను రక్షించే బాధ్యత గ్రామపంచాయతీ అధికా రులదేనని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. గురువారం ముప్కాల్ మంలంలోని సరిహ ద్దులోని జాతీయరహదారి ఇరువైపులా నాటి న మొక్కలను వేంపల్లి గ్రామశివారులో మొ క్కలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ముప్కాల్, జనవరి27: అవెన్యూ ప్లాం టేషన్లో భాగంగా నాటిన ప్రతీమొక్కను రక్షించే బాధ్యత గ్రామపంచాయతీ అధికా రులదేనని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. గురువారం ముప్కాల్ మంలంలోని సరిహ ద్దులోని జాతీయరహదారి ఇరువైపులా నాటి న మొక్కలను వేంపల్లి గ్రామశివారులో మొ క్కలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సం దర్భంగా మొక్కకు 12లీటర్ల నీరు పట్టేలా గుంతలు ఏర్పాటు చేసుకోవాలని, ట్రీ గార్డులు ఉండేవిధంగా ఉండాలని సూచించారు. ఎండిపోయిన మొక్కల స్థానంలో కొత్తమొక్కలు నాటి బాధ్య తగా తీసుకొని ఫారెస్టు అధికా రులను పర్య వేక్షించాలని ఆదేశిం చారు. ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, గ్రామ పంచాయ తీ సిబ్బంది మొక్కలు పెరిగే వరకు బాధ్య తగా వ్యవ హారించాలని సూచించా రు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో దామో దర్, సర్పంచ్లు జక్క సుగుణ గం గాధర్, సె క్రెట రీ రాజ్యలక్ష్మీ, లక్ష్మణ్, పాల్గొ న్నారు.