మొక్కల వివరాలను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి
ABN , First Publish Date - 2020-07-05T10:47:29+05:30 IST
ఆరోవిడుత హరితహారంలో భాగంగా నాటిన మొ క్కల వివరాలను ప్రభుత్వం వెబ్సైట్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని మున్సిపల్ చైర్మన్
మంచిర్యాలటౌన్, జూలై 4: ఆరోవిడుత హరితహారంలో భాగంగా నాటిన మొ క్కల వివరాలను ప్రభుత్వం వెబ్సైట్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య సిబ్బందిని ఆదేశించారు. మున్సిపల్ సమావేశ మందిరంలో శనివారం కమిషనర్ స్వరూపారాణితో కలిసి హరితహారం సిబ్బందితో సమావేశం ఏర్పాటుచేశారు. చైర్మన్ మాట్లాడుతూ అన్ని వార్డులలో రెవెన్యూ ప్లాం టేషన్తోపాటు ఇంటింటికి మొక్కల పంపిణీ చేస్తామన్నారు. మొక్కలు నాటడంతోపాటు వాటిని కాపాడాల్సిన బాధ్యత అందరిదని గుర్తు చేశారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచించారు. కమిషనర్ మాట్లాడుతూ హరిత హారం విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే ఉద్యోగులపై మున్సిపాలిటీ చట్టం ప్రకారం చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. మున్సిపల్ మేనేజర్ వెంకటేశ్వర్రావు, ఇంజనీరు ఎస్ శ్రీనివాస్, టౌన్ ప్లానింగ్ అఽధికారి సత్యనారాయణ, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.