మొక్కల సంరక్షణ సమిష్టి బాధ్యత : కలెక్టర్
ABN , First Publish Date - 2021-08-04T06:09:42+05:30 IST
జాతీయ రహదారి 44పై మొక్కలు నాటి వాటిని సంరక్షించేందుకు సమిష్టి బాధ్యత వ హించాలని కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ ఆదేశించారు.
నిర్మల్ కల్చరల్, ఆగస్టు 3 : జాతీయ రహదారి 44పై మొక్కలు నాటి వాటిని సంరక్షించేందుకు సమిష్టి బాధ్యత వ హించాలని కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ ఆదేశించారు. మంగళ వారం ఏర్పాటు చేసిన అటవీ, గ్రామ పంచాయతీ అదికారుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. నేషనల్ హైవే 44 కింద 12 గ్రామ పంచాయతీలు ఉన్నాయని అన్నారు. సోన్, గంజాల్, కడ్తాల్, కొండాపూర్, ఎల్లపల్లి, భాగ్యనగర్, నీలాయిపేట్, మేడి పల్లి, మామడ, మొండిగుట్ట, ఆడెల్లి, బూరుగుపల్లి జాతీయ ర హదారికి ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్లు ఏర్పాటు చేయా లన్నారు. కొలతల ప్రకారం గుంతలు తవ్వించి సకాలంలో పను లు పూర్తికి ఆదేశించారు. అటవీశాఖ మెటీరియల్ బాధ్యత చూసుకోవాలన్నారు. నిర్లక్ష్యానికి చోటులేకుండా నిర్వహించాల న్నారు. అదనపు కలెక్టర్ హేమంత్బోర్కడే, అటవీశాఖ అధికారి వికాసమీనా, ఎఫ్డీవో సిద్ధార్థ్ విక్రమ్సింగ్, ఎంపీడీవోలు, పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.