రైతుల ఆదాయం పెంచేందుకుప్రణాళికలు

ABN , First Publish Date - 2020-07-01T10:21:28+05:30 IST

ఉద్యాన రైతు ల ఆదాయం పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తానని వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ తోలేటి జానకిరామ్‌ స్పష్టం చేశారు.

రైతుల ఆదాయం పెంచేందుకుప్రణాళికలు

ఉద్యాన వర్సిటీ వీసీగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్‌ జానకిరామ్‌ 


తాడేపల్లిగూడెం, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి):ఉద్యాన రైతు ల ఆదాయం పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తానని వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ తోలేటి జానకిరామ్‌ స్పష్టం చేశారు. డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయ వైస్‌ చాన్స లర్‌గా మంగళవారం ఆయన బాధ్యతలు స్వీకరించి మాట్లాడారు. విశ్వ విద్యాలయంలో సమస్యలను పరిష్క రించేందుకు కృషి చేస్తానన్నారు.


ఉద్యాన పరిశోధన ఫలా లను రైతులకు అనుసంధానించే దిశగా  ప్రయత్నిస్తామ న్నారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు రోగనిరోధక శక్తి పెంచే పండ్ల రకాలను అభివృద్ధి చేస్తామని వివరించారు. మార్కెట్‌లో డిమాండ్‌కు అనుగుణంగా నూతన ఉద్యాన వంగడాలను రూపొందిస్తామన్నారు. విశ్వవిద్యాలయ అభి వృద్ధికి వైస్‌ చాన్సలర్‌గా డాక్టర్‌ చిరంజీవిచౌదరి నాలు గేళ్లలో చేసిన కృషిని ప్రశంసించారు. అనంతరం ఉద్యాన శాఖ కమిషనర్‌ డాక్టర్‌ చిరంజీవిచౌదరికి వీడ్కోలు సభ నిర్వహించారు. రిజిస్ర్టార్‌ బి.గోపాల్‌, విస్తరణ సంచాలకు డు డాక్టర్‌ బి.శ్రీనివాసులు, పరిశోధన సంచాలకుడు డాక్టర్‌ ఆర్‌ఎస్‌కే రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-01T10:21:28+05:30 IST