పథకాలను పకడ్బందీగా అమలు చేయాలి
ABN , First Publish Date - 2022-05-19T06:35:58+05:30 IST
ప్ర తిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. బుధవారం హైదరాబాద్లోని ప్రగతి భవన్లో కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు.
కలెక్టర ్ల సమావేశంలో సీఎం కేసీఆర్
భువనగిరి రూరల్, మే18: ప్ర తిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. బుధవారం హైదరాబాద్లోని ప్రగతి భవన్లో కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూన్ 3వతేదీ నుంచి 18వతేదీవరకు నిర్వహించే 5వవిడత పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమ నిర్వహణ, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్2న ఎంపిక చేసిన గ్రామాల్లో క్రీడ ప్రాంగణాలను ప్రారంభించే విధంగా చొరవ చూపాలని కలెక్టర్లకు సూచించారు. సమావేశంలో యాదాద్రి భువనగిరి, నల్లగొండ, సూర్యాపేట కలెక్టర్లు పమేలాసత్పథి, ప్రశాంత్ జీవన్పాటిల్, వినయ్కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్లు పాల్గొన్నారు.