తాగునీటి ఎద్దడి నివారణకు ప్రణాళికలు: ఐటీడీఏ పీవో
ABN , First Publish Date - 2020-03-28T10:16:03+05:30 IST
మన్యంలో తాగునీటి ఎద్దడి నివారణకు వేసవి ప్రణాళి కలు సిద్ధం చేస్తున్నామని రంపచోడవరం ఐటీడీఏ పీవో నిశాంత్కుమార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం తన కార్యాలయంలో
రంపచోడవరం, మార్చి27: మన్యంలో తాగునీటి ఎద్దడి నివారణకు వేసవి ప్రణాళి కలు సిద్ధం చేస్తున్నామని రంపచోడవరం ఐటీడీఏ పీవో నిశాంత్కుమార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం తన కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. 14వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయని వాటిద్వారా చేతిపంపులు, మంచినీటి పథకాల మరమ్మతులు నిర్వహించుకోవాలన్నారు.
విదేశాల నుంచి మన్యానికి వచ్చిన 15మందికి వైద్య పరీక్షలు జరిపించి వారిని హోం క్వారంటైన్లో ఉంచామని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి నిశాంత్కు మార్ తెలిపారు. చిత్తూరు జిల్లాలో ప్రత్యేక ఆర్థిక మండలిలో సెల్ఫోన్ల తయారీ పనుల కోసం వెళ్లిని 14మంది గిరిజన యువతకు రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తామని, హోం క్వారంటైన్ అవ్వాలని ఇళ్లకు పంపుతున్నామని పీవో పేర్నొన్నారు.