కరోనా నివారణకు సోషల్‌ డిస్టెన్స్‌ ఒక్కటే పరిష్కారం

ABN , First Publish Date - 2020-04-05T22:36:20+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను మరింత ప్రబలిస్తున్న ‘వైరల్‌ లోడ్‌’ అత్యంత ప్రమాదకరమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ఛైర్మన్‌ బోయిన్‌పల్లి వినోద్‌కుమార్‌ స్పష్టం చేశారు.

కరోనా నివారణకు సోషల్‌ డిస్టెన్స్‌ ఒక్కటే పరిష్కారం

హైదరాబాద్‌: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను మరింత ప్రబలిస్తున్న ‘వైరల్‌ లోడ్‌’ అత్యంత ప్రమాదకరమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ఛైర్మన్‌ బోయిన్‌పల్లి వినోద్‌కుమార్‌ స్పష్టం చేశారు. అంతర్జాతీయ వైద్య నిపుణులు, అమెరికా,ఆస్ర్టేలియా,కెనడా సహా పలు దేశాల యూనివర్శిటీలలో ప్రొఫెసర్‌గా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధిగా,ఎయిమ్స్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించి ప్రస్తుతం పబ్లిక్‌హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌గా ఉన్న డాక్టర్‌ కె. శ్రీనాధ్‌రెడ్డి,ఆసంస్ధకు హైదరాబాద్‌ కేంద్రంగా విధులు నిర్వహిస్తున్న సౌత్‌ఇండియా డైరెక్టర్‌ డా. జీవీఎస్‌ మూర్తితో వినోద్‌కుమార్‌ ఆదివారం కరోనాపై సుదీర్ఘంగా చర్చించారు. కరోనా వైరస్‌ విజృంభన, దానిపై పోరాటానికి అనుసరించాల్సిన మార్గాలపై వారితో వినోద్‌కుమార్‌ విపులంగా చర్చించారు. శ్వాస, గొంతు సమస్యలు, జ్వరం వంటి లక్షణాలు ఉన్న వ్యక్తి ఒక గదిలో గానీ జన సమూహం ఉన్నహాలులో ఉంటే వారివద్దకు రాకపోకలు సాగించే వ్యక్తులకు సోకి వైరల్‌లోడ్‌ పరిణమిస్తుందన్న విషయాన్ని వైద్య నిపుణులు నిర్ధారించారని వినోద్‌ తెలిపారు. 


శ్వాస, గొంతు సమస్యలు, జ్వరం వంటి లక్షణాలు ఉన్న వ్యక్తితో వారి కుటుంబ సభ్యులు సంప్రదింపులు జరిపినా, శుభకార్యాలు, సమావేశాలు,ఆయా మతాల కార్యక్రమాల నెపంతో పెద్ద సంఖ్యలో జనాలు ఒకే చోట గుమిగూడినా వైరల్‌లోడ్‌కు కారకులు అవుతారని అన్నారు. అంటే రోగ లక్షణాలు ఉన్న వ్యక్తిచుట్టూ ఎవరైనా పలుమార్లు తిరిగితే ఆ వ్యక్తికి ఉన్నరోగ తుంపర్లు పదే పదే ఇతరులకు చేరడం వ్లల వైరల్‌ భారం వైరల్‌లోడ్‌గా మారుతుందన్నారు. మూకుమ్మడి భేటీలకు దూరంగా ఉండడం ద్వారా, వైరల్‌లోడ్‌కు ప్రత్యామ్నాయ మార్గమని చెప్పారు. అన్నింటికన్నా ఉత్తమ మార్గం సోషల్‌ డిస్టెన్స్‌ను పాటించడమేనని వినోద్‌తెలిపారు. ఇదే విధానాన్ని మరో రెండు నెలల పాటు కనీసం అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కరోనా వైరస్‌ గ్రామీణ ప్రాంతాల్లో నియంత్రణలోనే ఉందని, పట్టణ ప్రాంతాల్లో మాత్రమే ఇది సమస్యగా మారిందని చెప్పారు. ట్రాక్‌, ట్రేస్‌, ట్రీట్‌ విధానం అనుసరణీయమని ఈ విధానాన్ని విధిగా అమలు చేస్తే ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని అభిప్రాయపడ్డారు. 

Updated Date - 2020-04-05T22:36:20+05:30 IST