కాంగోలో కూలిన కార్గో విమానం...ఐదుగురి మృతి

ABN , First Publish Date - 2020-08-15T11:26:52+05:30 IST

కాంగో దేశంలో ఓ కార్గో విమానం అడవుల్లో కుప్పకూలిన ప్రమాద ఘటనలో ఇద్దరు ఐదుగురు మరణించారు....

కాంగోలో కూలిన కార్గో విమానం...ఐదుగురి మృతి

దక్షిణ కివూ(కాంగో): కాంగో దేశంలో ఓ కార్గో విమానం అడవుల్లో కుప్పకూలిన ప్రమాద ఘటనలో ఇద్దరు ఐదుగురు మరణించారు.చిన్న కార్గో విమానం మనియమా నుంచి బుకావుకు వెళుతుండగా దక్షిణ కివూ ప్రావిన్సు పరిధిలోని దట్టమైన అడవుల్లో అత్యవసర ల్యాండింగుకు యత్నిస్తుండగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాద ఘటనలో ఇద్దరు పైలెట్లు, ముగ్గురు ప్రయాణికులు మరణించారు.ఈ విమాన ప్రమాదానికి కారణాలపై అమెరికా మిషన్ బృందం దర్యాప్తు చేస్తుందని కాంగో మంత్రి క్లౌడీ స్వీడి బసీలా చెప్పారు. కాంగో దేశంలో విమాన సర్వీసుల్లో భద్రతా ప్రమాణాలు సరిగా పాటించక పోవడం వల్ల తరచూ విమానాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని కాంగో విమాన సర్వీసులను యూరప్ నిషేధించింది. 

Updated Date - 2020-08-15T11:26:52+05:30 IST