మెదక్ జిల్లాలో 35 లక్షల మొక్కలు నాటే ప్రణాళిక
ABN , First Publish Date - 2021-06-20T06:02:38+05:30 IST
ఏడో విడత హరితహారంలో భాగంగా జిల్లాలో 35 లక్షలకు పైగా మొక్కలు నాటేందుకు ప్రణాళికలను రూపొందించినట్టు కలెక్టర్ హరీశ్ పేర్కొన్నారు.
పట్టణ నర్సరీలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హరీశ్
మెదక్ మున్సిపాలిటీ, జూన్ 19: ఏడో విడత హరితహారంలో భాగంగా జిల్లాలో 35 లక్షలకు పైగా మొక్కలు నాటేందుకు ప్రణాళికలను రూపొందించినట్టు కలెక్టర్ హరీశ్ పేర్కొన్నారు. మున్సిపల్ ఆధ్వర్యంలో వెంకట్రావ్నగర్, హౌసింగ్బోర్డు కాలనీల్లో ఏర్పాటు చేసిన నర్సరీలను కమిషనర్ శ్రీహరితో కలిసి శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 469 నర్సరీలలో మొక్కలు నాటడానికి సిద్ధంగా ఉన్నాయని వివరించారు. ఈ సంవత్సరం జిల్లాలోని ప్రధాన రహదారుల వెంట విరివిగా మొక్కలు నాటేందుకు ఆదేశించామన్నారు. ప్రజలు కూడా పట్టణ పరిశుభ్రతకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కలెక్టర్ పట్టణంలోని వెంకట్రావ్నగర్ కాలనీ పార్కు వద్ద మురికి కూపాన్ని పరిశీలించారు. మురికి నీరు ఎక్కడా నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని కమిషనర్ శ్రీహరిని ఆదేశించారు. కలెక్టర్ వెంట కమిషనర్ శ్రీహరి, డీఈ మహేష్, ఏఈ సిద్దేశ్వరి, కౌన్సిలర్ సమియొద్దిన్, నాయకులు ఉన్నారు.