తెలంగాణ గిడ్డంగుల శాఖలో భారీ స్కామ్కు ప్లాన్
ABN , First Publish Date - 2022-01-22T22:14:41+05:30 IST
తెలుగు అకాడమీ కుంభకోణంలో ప్రధాన నిందితుడు మరో భారీ స్కామ్
హైదరాబాద్: తెలుగు అకాడమీ కుంభకోణంలో ప్రధాన నిందితుడు, ప్రధాన సూత్రధారి అయిన షేక్ మస్తాన్ వలి సాహెబ్ మరో భారీ స్కామ్కు ప్రయత్నం చేశాడు. తెలంగాణ గిడ్డంగుల శాఖకి చెందిన 3.98 కోట్ల ( 3 కోట్ల 98 లక్షల ) రూపాయలను కాజేసే యత్నానికి ప్రణాళిక వేశాడు. దీంతో మస్తాన్ వలీపై సీసీఎస్ పోలీసులకు ప్రస్తుత యూనియన్ బ్యాంక్ కార్వాన్ బ్రాంచి మేనేజర్ గిరీష్ కుమార్ ఫిర్యాదు చేశారు. గిడ్డంగుల శాఖ ఫిక్స్డ్ డిపాజిట్లకు చెందిన ఫోర్జరీ పత్రాలను సృష్టించారని ఫిర్యాదు చేశారు. ఇప్పటికే మస్తాన్ వలీ తెలుగు అకాడమీ స్కామ్లో రెండు కేసులలో నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులలో చంచల్గూడ జైల్లో మస్తాన్ ఉన్నాడు. తాజా కేసులో మస్తాన్ వలీని పిటీ వారెంట్పై అదుపులోకి తీసుకొని సీసీఎస్ పోలీసులు విచారించనున్నారు.