మేఘాలయలో 1 నుంచి అన్ని ప్రార్థనా స్థలాల తిరిగి ప్రారంభం

ABN , First Publish Date - 2020-09-26T23:20:38+05:30 IST

మేఘాలయలో 1 నుంచి అన్ని ప్రార్థనా స్థలాల తిరిగి ప్రారంభం

మేఘాలయలో 1 నుంచి అన్ని ప్రార్థనా స్థలాల తిరిగి ప్రారంభం

షిల్లాంగ్: మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 6 నెలల కన్నా ఎక్కువ విరామం తర్వాత రాష్ట్రంలో అక్టోబర్ 1 నుంచి అన్ని ప్రార్థనా స్థలాలను తిరిగి తెరవాలని నిర్ణయించినట్లు మేఘాలయ ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. పుణ్యక్షేత్రాలలో అందరి భద్రతను నిర్ధారించడానికి అవసరమైన మార్గదర్శకాలను జారీ చేసిందని ఉప ముఖ్యమంత్రి ప్రెస్టోన్ టిన్సోంగ్ శనివారం చెప్పారు. "ఫేస్ మాస్క్ లేకుండా ఎవరినీ ఏ మత ప్రదేశంలోకి ప్రవేశించడానికి అనుమతించరని, ప్రజలు చేతి పరిశుభ్రత ప్రోటోకాల్‌లను అనుసరించడానికి, భౌతిక దూరాన్ని పాటించడానికి చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Updated Date - 2020-09-26T23:20:38+05:30 IST