ఆ స్థలానికి ఎటువంటి అనుమతులు లేవు
ABN , First Publish Date - 2021-04-21T13:33:00+05:30 IST
కాకాని రోడ్డులోని బిట్స్ కార్పొరేషన్ స్థలంలో..
ఇన్చార్జి సీపీ బి.సత్యనారాయణ
పెదకాకాని(గుంటూరు): కాకాని రోడ్డులోని బిట్స్ కార్పొరేషన్ స్థలంలో అక్రమ రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చిన ప్లాట్ల యజమానులకు నగరపాలక సంస్థ నుంచి ఎటువంటి అనుమతులు ఇచ్చేది లేదని ఇన్చార్జ్ సీపీ బి.సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఆంధ్రజ్యోతిలో ’రియల్ దందాకు రెక్కలు’ అనే శీర్షికన వెలువడిన కథనానికి ఆయన స్పందించారు. గత ఏడా ది నవంబర్లో షోకాజ్ నోటీసు లు జారీ చేశామని, వీసీఐఎం ఎస్ ద్వారా చర్యలు తీసుకుంటు న్నామన్నారు. ఈ విషయంపై టౌన్ ప్లానింగ్ డైరెక్టర్కు కూడా నివేదిక పంపామని తెలిపారు. అనధికారిక లే అవుట్లలో ఆన్ లైన్ ద్వారా ఎటువంటి ప్లాన్లు, మంజూరు చేయలేదని ఆయన తెలిపారు.