బ్రేకింగ్... లోటస్ పాండ్‌లో వైఎస్ షర్మిలతో పీకే టీమ్ భేటీ

ABN , First Publish Date - 2021-09-29T21:05:26+05:30 IST

లోటస్ పాండ్‌లో షర్మిలతో పీకే టీమ్ సభ్యులు సమావేశమయ్యారు.

బ్రేకింగ్... లోటస్ పాండ్‌లో వైఎస్ షర్మిలతో పీకే టీమ్ భేటీ

హైదరాబాద్: వైఎస్ షర్మిల పార్టీతో ప్రశాంత్ కిషోర్ (పీకే) టీమ్ అధికారికంగా జతకట్టింది. బుధవారం లోటస్ పాండ్‌లో షర్మిలతో పీకే టీమ్ సభ్యులు సమావేశమయ్యారు. పార్టీ విస్తరణ, పాదయాత్ర, పార్టీ బలోపేతం తదితర అన్ని అంశాలపై  ఈ టీమ్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. తెలంగాణలో వైఎస్సార్‌టీపీ పెట్టిన తర్వాత తన పార్టీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ వస్తారని షర్మిల మొదటి నుంచి చెబుతున్న విషయం తెలిసిందే. ఇక నుంచి షర్మిల పార్టీ కార్యక్రమాలన్నీ పీకే వ్యూహరచనలోనే జరగనున్నట్లు సమాచారం.

Updated Date - 2021-09-29T21:05:26+05:30 IST