అఖిలేష్ సన్నిహితుడి ఇంట్లో నోట్ల కట్టలు... అవాక్కైన అధికారులు
ABN , First Publish Date - 2021-12-24T21:44:50+05:30 IST
కాన్పూర్: సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్కు అత్యంత సన్నిహితుడు పీయూష్ జైన్ ఇంట్లో నోట్ల కట్టలు బయటపడ్డాయి
కాన్పూర్: సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్కు అత్యంత సన్నిహితుడు పీయూష్ జైన్ ఇంట్లో నోట్ల కట్టలు బయటపడ్డాయి. సుమారు 150 కోట్ల రూపాయల విలువైన నోట్లను ఇప్పటికే లెక్కించారు. లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. పన్ను ఎగవేతకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటోన్న పీయూష్ జైన్ ఇంటిపై ఐటీ అధికారులు దాడి చేశారు. కాన్పూర్లో ఉన్న పీయూష్ ఇంట్లో సోదాలు జరుపుతుండగా రెండు బీరువాలు అనుమానాస్పదంగా కనిపించాయి. తెరిచి చూసేసరికి కరెన్సీ నోట్ల కట్టలు కనిపించాయి. నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి జీఎస్టీ, పన్ను చెల్లింపులు ఎగ్గొట్టినట్లు దర్యాప్తులో తేల్చారు. పీయూష్ జైన్కు చెందిన మహారాష్ట్ర, గుజరాత్లోని కార్యాలయాలపై అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు.
మరోవైపు అఖిలేష్ అనుచరుడి ఇంట్లో నోట్ల కట్టలు బయటపడటంతో బీజేపీ విమర్శలు గుప్పించింది. పీయూష్ జైన్ సమాజ్వాదీ తరపున పెర్ఫ్యూమ్ కూడా తయారు చేస్తుండటంతో సమాజ్వాదీ పెర్ఫ్యూమ్ అవినీతి కంపు కొడుతోందని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ట్వీట్ చేశారు. పీయూష్ ఇంట్లో బయటపడిన అవినీతి సొమ్ము ఫొటోలు కూడా ఆయన జత చేశారు.
ఎన్నికల వేళ జరిగిన ఘటనతో సమాజ్వాదీ పార్టీలో కలకలం రేగింది.