పిఠాపురంలో చిన్నారులకు అస్వస్థత
ABN , First Publish Date - 2021-02-26T05:34:16+05:30 IST
పిఠాపురం, ఫిబ్రవరి 25: పట్టణంలోని నాల్గో వార్డులో చిన్నారులు ఆకస్మికంగా అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలతో పదిమంది చిన్న పిల్లలు వివి
వాంతులు, విరోచనాలతో ఆసుపత్రిలో చేరిక
పిఠాపురం, ఫిబ్రవరి 25: పట్టణంలోని నాల్గో వార్డులో చిన్నారులు ఆకస్మికంగా అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలతో పదిమంది చిన్న పిల్లలు వివిధ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స నిమిత్తం చేరారు. వీరికి ప్రస్తుతం చికిత్స అందుతోంది. వార్డులో ఉన్న అధ్వాన పారిశుధ్యం, తాగునీటి సరఫరాల్లో ఇబ్బ ందులతో ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. తాగునీరు కలుషితమవుతోందని తెలిపారు. చిన్నారులు అస్వస్థతకు గురైన సమాచారంతో మున్సిపల్, వైద్య సిబ్బంది ఇం టింటా సర్వే నిర్వహించారు. పారిశుధ్య, నీటి సరఫరా విభాగ అధికారులు వార్డులో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు.