మెరుగైన వైద్య సేవలందించడమే లక్ష్యం

ABN , First Publish Date - 2021-06-24T04:49:22+05:30 IST

పిఠాపురం, జూన్‌ 23: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తన లక్ష్యమని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు తెలిపారు. పిఠాపురం ప్రభుత్వాసుపత్రిలో నూ తనంగా ఏర్పాటు చేసిన చిన్నపిల్లల ఐసీయూ వార్డును ఆయన బుధవారం ప్రారంభించారు. కొవిడ్‌ థర్డ్‌వేవ్‌ ము ందుజాగ్రత్త చ

మెరుగైన వైద్య సేవలందించడమే లక్ష్యం
పిఠాపురం ప్రభుత్వాసుపత్రిలో చిన్నపిల్లల ఐసీయూ వార్డును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే దొరబాబు

పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు

పిఠాపురం, జూన్‌ 23: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తన లక్ష్యమని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు తెలిపారు. పిఠాపురం ప్రభుత్వాసుపత్రిలో నూ తనంగా ఏర్పాటు చేసిన చిన్నపిల్లల ఐసీయూ వార్డును ఆయన బుధవారం ప్రారంభించారు. కొవిడ్‌ థర్డ్‌వేవ్‌ ము ందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఇందులో చిన్నారుల కోసం పది ఆక్సిజన్‌ బెడ్‌లు సిద్ధం చేసినట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఇప్పటికే సాధారణ ప్రజల కోసం తన సొంత ఖర్చులతో కొవిడ్‌ ప్రత్యేకవార్డులో ఆక్సిజన్‌ బెడ్లు ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఎంత మొత్తాన్నయినా వెచ్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అనంతరం ఆసుపత్రిలో నూతనంగా తీర్చిదిద్దిన ప్రధాన వైద్యాధికారి చాంబర్‌ను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రభుత్వాసుపత్రి ప్రధాన వైద్యాధికారి డాక్టర్‌ విజయశేఖర్‌, అభివృద్ధి కమిటీ సభ్యు లు బొజ్జా దొరబాబు, రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-24T04:49:22+05:30 IST