రహదారులను పట్టించుకోని ప్రభుత్వం
ABN , First Publish Date - 2021-07-28T05:35:49+05:30 IST
గొల్లప్రోలు రూరల్, జూలై 27: గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు అధ్వానస్థితికి చేరినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్సఎన్ వర్మ విమర్శించారు. మండలంలోని చెందుర్తిలో పాడైన రోడ్లను మంగళవారం ఆయన పరిశీలించారు. అడుగడుగునా గోతులు పడినా
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ
గొల్లప్రోలు రూరల్, జూలై 27: గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు అధ్వానస్థితికి చేరినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్సఎన్ వర్మ విమర్శించారు. మండలంలోని చెందుర్తిలో పాడైన రోడ్లను మంగళవారం ఆయన పరిశీలించారు. అడుగడుగునా గోతులు పడినా కనీసం అందులో మట్టి కూడా వేయట్లేదని, ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. వర్మ వెంట మాజీ జడ్పీటీసీ మడికి ప్రసాద్, టీడీపీ నాయకులు మల్లిపూడి వీరబాబు, శివ, తాటిపర్తి త్రిమూర్తులు, భద్రరావు తదితరులున్నారు.