టీడీపీ వైపు చూస్తున్న ప్రజలు

ABN , First Publish Date - 2022-05-24T06:51:42+05:30 IST

పిఠాపురం, మే 23: రాష్ట్రంలో వైసీపీ అరాచకపాలన చూసి విసిగివేసారిపోయిన ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ తెలిపారు. పిఠాపురం టీడీపీ కార్యాలయంలో సోమవారం ఇమ్మిడిశెట్టి సోనాబా బు, సిద్దాంతపు ప్రదీప్‌ ఆధ్వర్యంలో 30వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన దోనిపాటి ప్రమీల, బీంసేన్‌, ప్రసాదరావు, నేతల జనార్థనరావు, బేబీ,

టీడీపీ వైపు చూస్తున్న ప్రజలు

రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ 

పిఠాపురం, మే 23: రాష్ట్రంలో వైసీపీ అరాచకపాలన చూసి విసిగివేసారిపోయిన ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ తెలిపారు. పిఠాపురం టీడీపీ కార్యాలయంలో సోమవారం ఇమ్మిడిశెట్టి సోనాబా బు, సిద్దాంతపు ప్రదీప్‌ ఆధ్వర్యంలో 30వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన దోనిపాటి ప్రమీల, బీంసేన్‌, ప్రసాదరావు, నేతల జనార్థనరావు, బేబీ, అగ్రహారపు దుర్గ టీడీపీలో చేరారు. వీరికి వర్మ కండువాలు కప్పి ఆహ్వానించారు. నాయకులు అందుగుల సత్తిబాబు, బోడపాటి పద్మ, దుర్గాడ విజయలక్ష్మి, అందుగుల పద్దరాజు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-24T06:51:42+05:30 IST