ఫిర్యాదులు రాకుండా పనిచేయాలి
ABN , First Publish Date - 2022-06-30T06:05:19+05:30 IST
ఫిర్యాదులు రాకుండా పనిచేయాలి
రేషన్ డీలర్లు, ఎండీయూ ఆపరేటర్లతో తహసీల్దార్ భద్రు
పెనమలూరు, జూన్ 29 : రేషన్ డీలర్లు, ఎండీయూ ఆపరేటర్లు ఎటువంటి ఫిర్యాదులు రాకుండా పనిచేయాలని తహశీల్దారు భద్రు సూచించారు. బుధవారం పెనమలూరులోని తహసీల్దారు కార్యాలయంలో షాపు డీలర్లు, ఎండీయూ ఆపరే టర్లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దారు మాట్లాడుతూ, రేషన్ షాపు డీలర్లు, ఎండీయూ ఆపరేటర్లు పరస్పర సహకారంతో పనిచేయాలన్నారు. సమావేశంలో పౌర సరఫరా విభాగం ఉప తహసీల్దారు భవాని, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.