పాక్ విమాన ప్రమాదం: వద్దని వారించినా వినని పైలట్లు

ABN , First Publish Date - 2020-06-05T01:54:19+05:30 IST

మే 22న కరాచీలో జరిగిన పాక్ విమానం ప్రమాదం వెనుకు పైలట్ల నిర్లక్ష్యం ఉందని పాకిస్తాన్ పౌర విమానయాన శాఖ తెలిపింది.

పాక్ విమాన ప్రమాదం: వద్దని వారించినా వినని పైలట్లు

ఇస్లామాబాద్: మే 22న కరాచీలో జరిగిన పాక్ విమానం ప్రమాదం వెనుకు పైలట్ల నిర్లక్ష్యం ఉందని పాకిస్తాన్ పౌర విమానయాన శాఖ తెలిపింది. ఏటీసీ చేస్తున్న సూచనలు పైలట్ పట్టించుకోకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రకటించింది. విమానాన్ని ల్యాండ్ చేయద్దని ఏటీసీ రెండు సార్లు హెచ్చరించినట్టు తెలిపింది. ఈ హెచ్చరికలను పైలట్ వినిపించుకోలేదని చెప్పింది. ఫలితంగా.. అవసరమైన దానికంటే ఎక్కువ వేగంతో విమానం రన్‌వే వైపు దూసుకువచ్చిందని ప్రకటించింది. వేగంగా రన్‌వేను తాకిన విమానం కుదుపులకు లోనవడంతో విమానాన్ని దింపడం సాధ్యం కాదని పైలట్ గుర్తించాడని చెప్పింది. ఆ తరువాత మరోసారి విమానాన్ని గాల్లోకి తీసుకెళ్లాక..కొన్ని నిమిషాలకు అది జావాసాల్లోకి దూసుకెళ్లి కూలిపోయింది. ఈ దుర్ఘటలో 97 మంది ప్రాణాలు కోల్పోగా..ఇద్దరు ప్రయాణికులు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 

Updated Date - 2020-06-05T01:54:19+05:30 IST