ధాన్యం కొనుగోలుపై హైకోర్టులో పిల్

ABN , First Publish Date - 2021-11-29T20:54:24+05:30 IST

ధాన్యం కొనుగోలు చేసేలా రాష్ట్రాన్ని ఆదేశించాలని న్యాయ విద్యార్థి బొమ్మనగారి శ్రీకర్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ధాన్యం సేకరణకు ఎఫ్‌సీఐతో రాష్ట్రం ఒప్పందం చేసుకుందని పిటిషనర్ పేర్కొన్నారు.

ధాన్యం కొనుగోలుపై హైకోర్టులో పిల్

హైదరాబాద్: ధాన్యం కొనుగోలు చేసేలా రాష్ట్రాన్ని ఆదేశించాలని న్యాయ విద్యార్థి బొమ్మనగారి శ్రీకర్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ధాన్యం సేకరణకు ఎఫ్‌సీఐతో రాష్ట్రం ఒప్పందం చేసుకుందని పిటిషనర్ పేర్కొన్నారు. 40లక్షల మెట్రిక్ టన్నుల సేకరణకు ఒప్పందం చేసుకుందని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రభుత్వం కొనుగోలు చేయక రైతులు నష్టపోతున్నారన్న న్యాయవాది అభినవ్ తెలిపారు. పంట నష్టపోయి రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని, కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసేలా ఆదేశించాలని పిటిషనర్ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఎఫ్‌సీఐకి ఆదేశాలివ్వాలని పిటిషనర్ కోరారు. వివరాలు తెలపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎఫ్‌సీఐకి హైకోర్టు ఆదేశించింది. ధాన్యం కొనుగోళ్లపై విచారణ డిసెంబరు 6కి వాయిదా  హైకోర్టు వేసింది.

Updated Date - 2021-11-29T20:54:24+05:30 IST