ప్లాట్లు, భవనాల రిజిస్ట్రేషన్ల నిలుపుదలపై పిల్
ABN , First Publish Date - 2020-09-25T09:19:52+05:30 IST
అనధికార ప్లాట్లు, భవనాల రిజిస్ట్రేషన్లను ఆకస్మికంగా నిలిపివేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్పందించింది...
హైదరాబాద్, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): అనధికార ప్లాట్లు, భవనాల రిజిస్ట్రేషన్లను ఆకస్మికంగా నిలిపివేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్పందించింది. ఈ వ్యాజ్యంలో పూర్తి వివరాలతో అక్టోబరు 14 లోగా కౌంటర్ దాఖలు చేయాలని రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్శాఖ కమిషనర్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్కు నోటీసు జారీచేసింది. తదుపరి విచారణను అక్టోబరు 15కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డితో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రంలో అనధికార ప్లాట్లు, భవనాల రిజిస్ట్రేషన్ను నిలుపుదలచేయడాన్ని ప్రశ్నిస్తూ గోపాలశర్మ అనే వ్యక్తి పిల్ చేశారు.