‘ఎస్‌ఈబీ’ ఏర్పాటుపై హైకోర్టులో పిల్‌

ABN , First Publish Date - 2020-06-04T09:28:44+05:30 IST

స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(ఎ్‌సఈబీ) ఏర్పాటుకు సంబంధించిన జీవో 41ను రద్దు చేయాలని అభ్యర్థిస్తూ హైకోర్టులో పిల్‌ దాఖలైంది. ప్రకాశం జిల్లా స్వర్ణ గ్రామానికి చెందిన పి.శ్రీనివాసరావు దీనిని దాఖలు చేశారు. ఏపీ పబ్లిక్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఆర్డర్‌ 1975, ఏపీ

‘ఎస్‌ఈబీ’ ఏర్పాటుపై హైకోర్టులో పిల్‌

స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(ఎ్‌సఈబీ) ఏర్పాటుకు సంబంధించిన జీవో 41ను రద్దు చేయాలని అభ్యర్థిస్తూ హైకోర్టులో పిల్‌ దాఖలైంది. ప్రకాశం జిల్లా స్వర్ణ గ్రామానికి చెందిన పి.శ్రీనివాసరావు దీనిని దాఖలు చేశారు. ఏపీ పబ్లిక్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఆర్డర్‌ 1975, ఏపీ ఎక్సైజ్‌ చట్టం 1968, రాష్ట్ర ప్రభుత్వ బిజినెస్‌ రూల్స్‌ 2018కి విరుద్ధంగా ఈ జోవో ఉందన్నారు. దీంతోపాటు తదనుగుణంగా జారీ అయిన జీవోలను కూడా రద్దు చేయాలని అభ్యర్థించారు. ఎస్‌ఈబీకి న్యాయబద్ధ అనుమతి లేదని, అలాంటప్పుడు వారు నమోదు చేసిన కేసులు న్యాయపరీక్షకు నిలబడవని తెలిపారు. మరో పిటిషన్‌తో కలిపి ఈ పిల్‌పై గురువారం విచారణ జరగనుంది.

Updated Date - 2020-06-04T09:28:44+05:30 IST