వైసీపీ మంత్రి Usha charan అనుచరులపై AP highcourtలో పిల్

ABN , First Publish Date - 2022-07-06T17:30:29+05:30 IST

వైసీపీ మంత్రి ఉషాచరణ్ అనుచరులు కళ్యాణదుర్గంలో 200 ఎకరాల చెరువు కబ్జా చేస్తున్నారంటూ హైకోర్టులో పిల్ ధాఖలైంది.

వైసీపీ మంత్రి Usha charan అనుచరులపై AP highcourtలో పిల్

అమరావతి: వైసీపీ(YCP) మంత్రి ఉషాచరణ్ (Usha charan) అనుచరులు కళ్యాణదుర్గంలో 200 ఎకరాల చెరువు కబ్జా చేస్తున్నారంటూ హైకోర్టు(High court)లో పిల్ ధాఖలైంది. కళ్యాణ దుర్గం టీడీపీ (TDP) ఇంచార్జ్ ఉమామహేశ్వరరావు నాయుడు (Umamaheshwarrao naidu) బుధవారం ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. సర్వే నంబర్ 329లోని 100 ఎకరాల సుబేదార్ చెరువును లారీలతో మట్టిని తరలించి పూడ్చి ఫ్లాట్‌లాగా అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారన్న పిటిషనర్ తరుపు న్యాయవాది యలమంజుల బాలాజీ (Yalamanjual balaji) కోర్టుకు తెలిపారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఈ కేసుకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ రెవిన్యూ, కలెక్టర్, ఆర్డీఓలను పిటిషనర్ ప్రతివాదులుగా చేర్చారు. పిటిషన్‌ను విచారించేందుకు అనుమతించిన కోర్టు... రెండువారల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాని(Government)కి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. 

Updated Date - 2022-07-06T17:30:29+05:30 IST