వైద్యులకు రక్షణ కల్పించాలి

ABN , First Publish Date - 2021-06-19T05:20:30+05:30 IST

వైద్యులకు రక్షణ కల్పించాలి

వైద్యులకు రక్షణ కల్పించాలి
మంత్రి అప్పలరాజుకు వినతిపత్రం అందిస్తున్న దృశ్యం

పలాస : వైద్యులకు రక్షణ కల్పించా లని కోరుతూ పలాస- కాశీ బుగ్గ ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్యులు మంత్రి సీదిరి అప్పల రాజుకు శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు వైద్యులు మాట్లాడుతూ కరోనా వేళ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వైద్యులు పనిచేస్తుంటే దేశవ్యాప్తంగా వారిపైనే దాడులు జరగడం దురదృష్టకర మని, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు వైద్యాలయాలకు రక్షణ కల్పించాలని కోరారు. ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్‌ ఎం.మల్లేశ్వరరావు, కార్యదర్శి డాక్టర్‌ కణితి కేశవరావు, కోశాధికారి ఎస్‌.విజయ్‌కుమార్‌, హరి రాజ్‌కుమార్‌తో పాటు జంటపట్టణాలకు చెందిన వైద్యులు పాల్గొన్నారు. ఫ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన వాహనమిత్ర పథకం దేశచరిత్రలో నిలిచిపో తుందని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. శుక్రవారం వాహనమిత్ర పథకానికి మద్దతుగా పలాస-కాశీబుగ్గలో ఆటో కార్మికులు నిర్వహించిన ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం ఎస్‌బీఐ కార్యాలయం ఎదురుగా ఉన్న మైదానంలో కార్మికులను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. కార్యక్ర మంలో చైర్మన్‌ బళ్ల గిరిబాబాబు, ఆటో కార్మిక సంఘ గౌరవాధ్యక్షుడు బడగల బాలచంద్రుడు, ఏఎంసీ చైర్మన్‌ పీవీ.సతీష్‌కుమార్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-06-19T05:20:30+05:30 IST