భౌతిక దూరమే కరోనా నివారణకు మార్గం

ABN , First Publish Date - 2020-04-04T09:39:04+05:30 IST

కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రజలు సామాజిక దూరం పాటించడమే ఏకైక మార్గమని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు

భౌతిక దూరమే కరోనా నివారణకు మార్గం

టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు సీఎల్‌ శ్రీనివాస్‌యాదవ్‌ 


ఆమనగల్లు: కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రజలు సామాజిక దూరం పాటించడమే ఏకైక మార్గమని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు, తలకొండపల్లి మాజీ ఎంపీపీ సీఎల్‌ శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. తలకొండపల్లి మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం ఆయన పర్యటించి ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ నేపథ్యంలో దాతలు, స్వచ్ఛంద సంస్థలు ప్రస్తుత పరిస్థితుల్లో పేదలు, యాచకులకు చేయూతనందించాలని కోరారు. 

Updated Date - 2020-04-04T09:39:04+05:30 IST